– రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అమీర్ నగర్ లో ఐకేపీ సెంటర్, నర్సాపూర్, కోన సముందర్ గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధరను తీసుకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యంకు రూ.2389, బి గ్రేడ్ కు రూ.2369 ప్రభుత్వం మద్దతు ధరను అందిస్తుందని తెలిపారు.
సంచులు, లారీల కోసం రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందన్నారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకెట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, ఏఎంసీ డైరెక్టర్ జైడి మధులత శ్రీనివాస్, రాములు నాయక్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, నాయకులు గోపిడి లింగారెడ్డి, నూకల బుచ్చి మల్లయ్య, కొమ్ముల రాజేందర్, భూమారెడ్డి, గంగారెడ్డి, పుప్పాల నర్సయ్య, సంజీవ్, గణేష్, రాకేష్, సామ మహేందర్, సామ భూమారెడ్డి, చెంగల అశోక్, ఐకేపీ సీసీలు పీరియా, రవి, పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్ బాబూరావు, కార్యదర్శి కార్తీక్, మాజీ చైర్మన్ బాపురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES