- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర : రైతు భరోసా సంబరాలను మండలంలోని అవుతాపురం గ్రామంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ప్రసంగాన్ని రైతులు వీక్షించారు. రైతు భరోసా ముగింపు కార్యక్రమంలో భాగంగా వానాకాలం 2025 పెట్టుబడి సాయంపై సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్, ఏఈవో విశ్వశాంతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్, నరేష్, సోమనర్సయ్య, సోమన్న, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -