- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం నాడు పీర్ల పండుగ ఊరేగింపు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పీర్ల పండుగ సందర్భంగా జనాలు బెల్లం ఊదుతో మొక్కులు తీర్చుకున్నారు. పీర్లను భాజా భజంత్రీలతో మండల కేంద్రంలో వాడవాడలో ఊరేగించారు. పీర్లకు మొక్కులు మొక్కుకుంటే పరిష్కారం అవుతాయని నమ్మకంతో జనాలు పీర్ల ఊరేగింపులో పాల్గొని బెల్లం ఊదు సధిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. పీర్ల పండుగ ఊరేగింపుతో పండుగ వాతావరణం కనిపించింది.
- Advertisement -