- Advertisement -
నవతెలంగాణ – మద్నూర
మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హనుమాన్ స్వాముల పడిపూజ భారీ ఎత్తున నిర్వహించారు. పడి పూజ బిక్ష అనంతరం సాయంత్రం 7 గంటలకు బస్వలింగ అవధూత మహారాజ్ సుల్తాన్ పేట్ గ్రామానికి వస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ పడిపూజ కార్యక్రమానికి గ్రామ సర్పంచిగా ఆయన దగ్గరుండి హనుమాన్ దీక్ష స్వాములకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. బసవలింగ అవధూత రాక కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయించారు హనుమాన్ స్వాముల మహా పడిపూజ బిక్ష లో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



