Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహాలతో నిరుపేదలకు ఆనందం..

ఇందిరమ్మ గృహాలతో నిరుపేదలకు ఆనందం..

- Advertisement -

చాపల ఉమాదేవి, నరేందర్.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
: చాలాకాలం తర్వాత ఇందిరమ్మ గృహాలతో నిర్మాణంతో నిరుపేదల సంతోషిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ చాపల ఉమాదేవి అన్నారు. సోమవారం మండలంలోని చల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వేల్పుగొండ ప్రకాష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్  సూచన తో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమాదేవి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు ఇందిరమ్మ గృహాలు నిర్మించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు సాధ్యమని మరోసారి రుజువైందని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన సువాసిని రెడ్డి మరియు జబ్బర్ గార్ల ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బోనగాని సారయ్య గౌడ్ ,మాజీ సర్పంచ్ మేకల సుదర్శన్,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు తాటి శ్రీను ,సతీష్ రెడ్డి, సతీష్ యాదవ్, మహిళల నాయకులు  రాధిక, స్వప్న జ్యోతి మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -