- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో ఆదివారం సర్పంచ్ గీయాసుద్దీన్ అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి వారికి ఉచిత మందులను అందజేశారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల అభివృద్ధికి సహకరించే పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగేష్, గ్రామ కార్యదర్శి నాగరాజు, ఆరోగ్య కార్యకర్తలు ఆశలు పాల్గొన్నారు.
- Advertisement -



