- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ట్రైనింగ్ లో మూడు విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారాలు అందుకున్న సందర్భంగా డిఇఓ పార్షి అశోక్ కుమార్ ను ఆయన స్వగృహంలో బిసిటియు పక్షాన శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టాల రామకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, కోశాధికారి రాజు, గౌరవ సలహాదారులు రమణ స్వామి, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -