నవతెలంగాణ – మల్హర్ రావు
మండల పరిషత్ కార్యాలయంలో దాదాపు ఆరు సంవత్సరాల పాటుగా ఎంపిడిఓగా విధులు నిర్వహించిన గుండ నరసింహమూర్తి ఇటీవల నల్లబెల్లికి బధిలైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఈ నెల 31న పదవి విరమణ చేయబోతున్న సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు,కారొబార్ లు ఆదివారం నల్లబెల్లి మండల పరిషత్ కార్యాలయంలో నరసింహమూర్తి-విజయ దంపతులను పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా మాట్లాడారు శేష జీవితం ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలొ ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వరులతో గడపాలని దేవుడిని ప్రార్ధించ్చినట్లుగా తెలిపారు. తాను 32 సంవత్సరాల నుండి పంచాయతీ రాజ్ విభాగంలో సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియపారు ఈ కార్యక్రమంలో టిపిఎస్ఏప్ జాయింట్ కార్యదర్శి కర్ణకంటి నరేశ్, టిజిపియుఈఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శులు సమ్మరాజు,కుమార్,ప్రసాద్,సాయి చరణ్,రమేష్,భాస్కర్ రెడ్డి, కారొబార్ లు సాదుల శ్రీకాంత్,కుమారస్వామి, పాషా పాల్గొన్నారు.
ఎంపీడీఓ నరసింహమూర్తి-విజయ దంపతులకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES