- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దామరగిద్ద గ్రామంలో, ప్రభాకర్ అనే వ్యక్తి హెచ్బీఎం ఫైనాన్స్ పేరుతో పలువురిని మోసం చేసి పారిపోయాడు. దీంతో నష్టపోయిన బాధితులు ప్రభాకర్ భార్య, అంగన్వాడీ టీచర్ అయిన వసంతకుమారిని చెట్టుకు కట్టేసి అవమానించారు. గ్రామ పెద్దల జోక్యంతో ఆమెను విడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో, వసంతకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. భర్త చేసిన తప్పుకు భార్యను శిక్షించడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



