– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సంయుక్త కార్మిక కమిషనర్ (హెడ్ క్వార్టర్స్) ఆర్.చంద్రశేఖరంకు సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్ మాట్లాడుతూ కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లోని సిర్పూర్ పేపర్ మిల్లులో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి తర్వాత నిలుపుదల చేశారని తెలిపారు. 2024 నవంబర్లో మిల్లులోని అన్ని రిజిష్టర్ కార్మిక సంఘాలకు అదిలాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ లెటర్లు పంపించారని వివరించారు. నవంబర్ మూడో తారీఖు లోపు యూనియన్ల వివరాలు, మాన్యువల్ రిటర్న్స్, సమర్పించిన ఎకనాలెడ్జిమెంట్ అందయాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు అన్ని కార్మిక సంఘాలు వివరాలు అందజేశాయని తెలిపారు. ఏడు నెల్లు గడిచినప్పటికీ అదిలాబాద్ డీసీఎల్ ఆఫీసు నుండి ఎలాంటి స్పందన రాకపోవటంతో మార్చి 20న కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలవటంతో ఆదిలాబాద్ డీసీఎల్ ఎన్నికల పక్రియ ప్రారంభించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. కార్మిక సమస్యలపై ఎప్పటికప్పుడు యజమాన్యంతో చర్చలు జరిపి కార్మికులు సమస్యలు పరిష్కారం చేసే గుర్తింపు సంఘం లేనందున అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు.ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం కోసం రహస్య బ్యాలెట్ ఎన్నికలు పక్రియను వేగవంతం వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ కూశన రాజన్న, వైస్ ప్రెసిడెంట్ ముంజం శ్రీనివాస్ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజేందర్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES