Sunday, June 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వేయాలి..

అక్రమ ఇసుకకు అడ్డుకట్ట వేయాలి..

- Advertisement -

నవతెలంగాణ -మద్నూర్ : రాత్రింబవళ్లు ఇష్ట రాజ్యాంగ మంజీరా నది నుండి అక్రమంగా ఇసుక తరలించే వాటికి హద్దులు లేకుండా పోతున్నాయి. సోమవారం ఉదయం డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా అక్రమ ఇసుక తరలించే వాటిపై నిఘా పెట్టగా.. బొలెరో బండి పట్టుబడింది. ట్రాక్టర్లు మాత్రం అక్రమ ఇసుక తరలిస్తూ.. యధావిధిగా కొనసాగడం పట్ల ట్రాక్టర్ల విషయం ఏమిటనే చర్చ మండల ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. అధికారులు పకడ్బందీ నిఘా పెడుతూ కొన్ని వానాలను పట్టుకుంటున్నప్పటికీ, ట్రాక్టర్ల విషయంలో మౌనం ఎందుకని ప్రజలు చర్చించుకుంటున్నారు. అక్రమ ఇసుక దందా తరలిపోకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయవలసి ఉందని పలువురు అంటున్నారు. నామమాత్రంగా అధికారులు రోడ్ల పైననే నిఘా పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ ఆదేశాల ప్రకారం .. అక్రమ ఇసుక దందాను పకడ్బందీగాతో కట్టడి చేయాలని, మండల ప్రజలు కోరుతున్నారు. పట్టుబడ్డ బొలెరో వాహనాన్ని మద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సేఫ్ కస్టడీ కోసం పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డ వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆర్ఐ సాయిబాబా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -