- Advertisement -
– జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
నవతెలంగాణ-సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (జూన్ 1 నుంచి 30 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలూ చేపట్టకూడదని తెలిపారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
- Advertisement -