- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఎన్ఈపి- 2020 రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలోని ఉపాధ్యాయులు ఆందోళన, నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు తిరుపతి, ఉపాధ్యాయులు కుమారస్వామి, రమేష్, పూర్ణచందర్, శ్రీధర్, జగన్, శివరాణి, రాజేందర్, మహేష్, వెంకట్, శివలింగం పాల్గొన్నారు.
- Advertisement -



