నవతెలంగాణ – కాటారం
గిరిజన గురుకుల బాలుర కళాశాల కాటారంలో జరిగినటువంటి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇంచార్జి ప్రిన్సిపల్ మాధవి గారు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య అవస్యకథను తెలియజేస్తూ భారత దేశ పౌరులందరికీ ఈ రోజు పండగ లాంటిదని స్వేచ్ఛ అనుభవిస్తూ ,స్వాతంత్యాన్ని దుర్వినియోగం చేయకుండా నేటి బాలలే రేపటి భావిభారత పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్తులు అయి సమానత్వం కోసం పాటుపడాలని తెలిపారు. విద్యార్థుల ఉపన్యాసాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ అయిన సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ A.మాధవి గారు , జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ M. వెంకటయ్య,డిప్యూటీ వార్డెన్ పీడీ మహేందర్ గారు,బలరాములు గారు,శ్రీనివాస్, రాజబాపు , వేల్పుల సంపత్ , సంతోష్ , కె . రాజయ్య, జక్కు వీరయ్య, రామకృష్ణ,, పిఇటి శ్రీనివాస్, కళాశాల అధ్యాపక ఉపాధ్యాయులు,బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
గురుకుల కళాశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES