నవతెలంగాణ – కంఠేశ్వర్
వర్ని రోడ్లో గల సెయింట్ జేవియర్స్ పాఠశాల ఆవరణలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు తెలియజేశారు. జాతీయ పతాకాన్ని క్లబ్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు ఎగురవేయడం జరిగిందని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడైన ఈ సంవత్సర కాలంలో చేయగల సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ ఇప్పటివరకు ఈ 30 రోజుల కాలంలో 300 మంది గర్భిణీ స్త్రీలకు పోశాక ఆహార కిట్లను అందించడం జరిగిందని అలాగే అవయవదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రమేష్ , రోటరీ కాకతీయ రీజియన్ ట్రైనర్ రంజిత్ సింగ్ ఠాకూర్ , ఇతర సభ్యులు పాఠశాల ప్రిన్సిపల్ లతా గౌడ్ , విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES