- Advertisement -
నవతెలంగాణ-  వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోతీలాల్ నాయక్ , సింగిల్ విండో డైరెక్టర్  వెంకటయ్య గౌడ్,  జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య,  టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్ర శీను,  మైనార్టీ నాయకులు ఎండి రషీద్, సాయి రెడ్డి ,మహేందర్ రెడ్డి, చెన్నయ్య,  గోపాలు , చందు నాయక్ ,భరత్ గౌడ్ పాల్గొన్నారు.ఫోటో. ఇందిరాగాంధీకి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు. 
- Advertisement -

 
                                    