Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు దక్కలేదు

ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు దక్కలేదు

- Advertisement -

మాజీ జెడ్పిటిసి రామాసహయం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి 

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పిటిసి రామసాయం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం కాటాపూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి నిరుపేదలకు ఇవ్వకుండా ఐదు నుంచి పది ఎకరాల భూమి ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేయడం దారుణమని, వెంటనే అర్హులను గుర్తించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని మీడియా ఛానళ్ల, పత్రిక పై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యంలో పత్రికల గొంతు నొక్కడం అని అన్నారు. పత్రిక రంగం ఎవరికైనా సమానమేనని ఇలాంటి దుర్మార్గ చర్యలకు పూనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాజివ్ యువశక్తి ఎంపికలో కూడా అర్హులైన నిరుద్యోగులను ఎంపిక చేయాలని, పార్టీ కార్యకర్తలను ఎంపిక చేయడం సరైన కాదాని అన్నారు. మేడారంలోని ఇసుక దందాను కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా దోచుకుంటున్నారని ఇక్కడ తాసిల్దారుగా గిరిబాబు, మంజుల వచ్చి కొద్ది రోజులకే బదిలీ చేయించడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు దక్కుతుందని అక్రమంగా సంపాదించుకోవడానికి ఓడికట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు దిడ్డి మోహన్రావు, న్యూశెట్టి రమేష్, మాజీ సర్పంచ్ గౌరమ్మ, జాజ చంద్రం సయ్యద్ హుస్సేన్, రంగు సత్యం, శ్రీకాంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -