నవతెలంగాణ – ఉప్పునుంతల : విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని గురువారం సీపీఐ (ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరంలో ప్రభుత్వ బడులు పున: ప్రారంభం కావడంతో “ప్రభుత్వ పాఠశాలలు పునాదుల మొదలుగా అభివృద్ధి చెందాల్సిన సమయంలో, తగిన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం మంజూరు చేసిన ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో కొన్ని నెలల క్రితం భూమీ పూజా చేసి ఇప్పటికి పనులు ప్రారంభించాకపోవడం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ” డిమాండ్ చేశారు. అలాగే, విద్యా ప్రమాణాలు పతనమవుతున్నాయని తెలిపారు. పాఠశాల కోసం కేటాయించిన భూమిని అధికారులు పరిశీలించి వెంటనే నిర్మాణం చేపట్టాలని అన్నారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన అయ్యి తొమ్మిది నెలలు… ఇంకా పనులు ప్రారంభం కాలేదు!
విద్యార్థులకు వసతి గృహాల కొరతతో తీవ్ర ఇబ్బందులు మండలంలో ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి గతంలోనే శంకుస్థాపన జరిగి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విద్యా ప్రస్తుత పరిస్థితిని వివరించిన నాయకులు ప్రభుత్వం వైఖరిని నిర్లక్ష్యంగా అభివర్ణించారు. విద్యార్థులకు వసతి గృహాల సౌకర్యం సరిపోక, అనేక మంది దూర ప్రాంతాలనుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్నారని, విద్యను బలపరచాలంటే వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలంటే, గ్రామీణ విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించాలంటే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అవసరం ఎంతగానో ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసి, పనులను మొదలుపెట్టి వేగవంతం చేయాలని కోరుతున్నారు. లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే విద్యార్థులపై ప్రత్యేక చొరవ తీసుకొని ఇంటిగ్రేటెడ్ నిర్మాణానికి కృషి చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కంచ హుస్సేన్, కేసు మల్ల సైదులు పాల్గొన్నారు.