- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నర్సాపురం గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థిని జాహ్నవి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



