- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటింది.జిల్లాల పునర్విభజన సైతం జరిగి పదేళ్లు గడుస్తుంది.అయిన మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు బోర్డు మార్చకుండా ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కొనసాగడం గమనార్హం. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే జయశంకర్ భూపాలపల్లి జిల్లా బోర్డు మార్పించడంలో నిర్లక్ష్యంగా చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధించిన మండల విద్యాశాఖ అధికారి స్పందించి బోర్డును మార్చేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
- Advertisement -



