మాజీ జెడ్పిటిసి, రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి
కాంగ్రెస్ పార్టీ రైతు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాడు కెసిఆర్ నాట్లకు నాట్లకు రైతుబంధు ఇస్తే..నేడు రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకు రైతు భరోసా ఇస్తుండు..ఎన్నికలప్పుడే రైతులు, గుర్తొస్తారా.. అని ఆయన ప్రశ్నించారు. రైతుల పేరిట సంబరాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి 18 నెలలు రైతులకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. నాలుగు విడుదల రైతు భరోసా ఏగోట్టినందుకు రైతు సంబరాలా. చేసుకోవడం సిగ్గుచేటు అని అన్నారు.
మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ అని చెప్పి చివరికి సన్నవడ్లకు ఇచ్చి చేతులు దులుపుకోవడం తోపాటు సన్నా వడ్లకు కూడా బోనస్ మూడు దపాలు ఎగోట్టినందుకు సంబరాలు చేసుకోవడం రైతులను మోసం చేయడం కదా అని ప్రశ్నించారు. రైతు భరోసా పేరు మీద ఎకరానికి రూ.15000 ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి మాట మార్చి మళ్లీ రూ.12000 ఇస్తానని చెప్పి చివరికి అవి కూడా రైతులకు పూర్తిస్థాయిలో ఇవ్వనందుకు సంబరలా చేసుకోవడం రైతులు సిగ్గు పడుతున్నారని అన్నారు.
రైతు కూలీలకు ఇస్తానన్న రూ.12 వేల ఏగోట్టినందుకు సంబరాలా. రైతు కూలీలను మోసం చేసినట్లు కాదా అని అన్నారు. పంటలకు సాగునీరు ఇవ్వనందుకు సంబరాలా,వడగండ్ల వాన పడితే రైతులను పట్టించుకోనందుకు సంబరాలా,రైతు బీమా ప్రీమియం కట్టకుండా బీమా ఎగ్గొట్టినందుకు సంబరాలా,ఖమ్మంలో, రంగారెడ్డిలో, గద్వాల జిల్లాల రైతులకు బేడీలు వేసినందుకు సంబరాలా,గతంలో కేసీఆర్ చెట్లకు గుట్లకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చిండు అని చెప్పి బధనం చేసి నేడు మీరిస్తున్నది ఏంటి? మిమ్మల్ని ఏమనాలి. నిజమైన రైతు బంధు కేసీఆర్ మాత్రమే.నాడు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
రైతు బంధును అనేక ప్రపంచ సంస్థలు ప్రశంసించాయి అని అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును దేశములో అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నయి, చివరికి దేశమే ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి కిసాన్ పేరు మీద దేశవ్యాప్తంగా ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జాజ చంద్రం, మాజీ మండల అధ్యక్షుడు నుశెట్టి రమేష్, మండల మహిళా అధ్యక్షురాలు సోమ నాగమ్మ, తుమ్మల రాజేందర్, కొర్నిబెళ్లి శేషగిరి, కొత్తూరు రోహిత్, గడదాసు దేవయ్య, బాబు, దుర్గం నవీన్, దుర్గం రవి, రామసహాయం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.