ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’తో హీరోయిన్ రష్మిక మందన్న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో రవీంద్ర పుల్లె డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్తో బజ్ను సష్టించింది. అన్ఫార్ములా ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఓ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ ‘సరిపోదా శనివారం’ ఫేం జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జేక్స్ బిజోయ్ ట్రైబల్ వాయిద్యాలతో రీరికార్డింగ్ చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. ‘సౌండింగ్ అదిరిపోయింది. ‘మైసా’ మ్యూజికల్గా గ్రాండ్ స్కేల్లో ఉండబోతుంది. గోండ్ తెగల బ్యాక్ డ్రాప్లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల్ని అలరించనుంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్లో సర్ప్రైజ్ చేయనుంది. సూర్య ‘రెట్రో’ సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తుండగా, ‘కల్కి 2898 ఏ డీ’ ఫేమ్ ఆండి లాంగ్ యాక్షన్ కొరియోగ్రఫీని డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుంది’ అని చిత్ర యూనిట్ చెప్పింది.
‘మైసా’కి జేక్స్ బిజోయ్ మ్యూజిక్
- Advertisement -
- Advertisement -