నవతెలంగాణ – జన్నారం : జన్నారం మండల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని లైన్స్ క్లబ్ సభ్యులు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా తోట లచ్చన్న, క్లబ్ సెక్రటరీగా ఎర్ర ప్రవీణ్ క్లబ్ ట్రెజరర్ కామెరా ప్రేమ్ సాగర్, క్లబ్ ఉపాధ్యక్షులుగా రామడుగుల రమేష్ రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ తో ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ గవర్నర్ లయన్ మోర బద్రిశం ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్ పర్సన్ కస్తూరి సతీష్ కుమార్ , క్యాబినెట్ మెంబర్స్, ఏనుగు శ్రీకాంత్ రెడ్డి ,జక్కు భూమేష్ అంజితరావు, లయన్స్ పెద్దలు, లేడి లయన్స్ లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తోట లచ్చన్న మాట్లాడుతూ క్లబ్ అభివృద్ధి కోసం సాయ శక్తుల శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అన్ని విధాల ముందుకు తీసుకెళ్తానని క్లబ్బు సభ్యుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని,అన్నారు. తన యొక్క ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి తెలుపుతున్నామన్నారు.
జన్నారం లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES