- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోన సముందర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైడి శ్రీనివాస్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి ఆయనను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న వివిధ సమస్యలపై మహేశ్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సంజీవ్, సేవాలాల్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



