నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని తాడిచెర్ల అధ్యాపకులు అన్నారు.శుక్రవారం ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ పొందవలసింది గా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 2025 మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో సెకండ్ ఇయర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించారని, 8 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ లో మంచి ర్యాంకు సాధించారని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు అనుభవజ్ఞులైన విద్య బోధన అధ్యాపకులచే నాణ్యమైన విద్యాబోధన, విద్యార్థినులకు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత పాఠ్య పుస్తకాలు, స్కాలర్షిప్ల పంపిణీ జరుగుతుందన్నారు.విద్యార్థులు ఇంతకుముందు వార్షిక పరీక్షలు రాయడానికి సుదూర ప్రాంతమైన కాటారం వెళ్లవలసి వచ్చేదని కానీ మార్చి పబ్లిక్ పరీక్షల నుండి తాడిచెర్ల కళాశాలలోనే ప్రయోగశాల, వార్షిక పరీక్షల సెంటర్ ఏర్పాటయిందన్నారు.కావున విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ఎం విజయదేవి కోరారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES