Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువరుణుడి కరుణ కోసం 'కప్పతల్లి' ఆట     

వరుణుడి కరుణ కోసం ‘కప్పతల్లి’ ఆట     

- Advertisement -

కొండన్నపల్లిలో కప్పలపై ఇంటింటా నీరు పోస్తూ గ్రామస్తుల వినూత్న ప్రయత్నం
నవతెలంగాణ – గంగాధర
: వరుణుడి కరుణ కోసం కర్రకు కప్పతల్లిని కట్టి ఇంటింటా నీరు పోస్తూ వర్షాలు కురువాలని ఓ ఊరి గ్రామస్తులు వినూత్న ప్రయత్నం చేశారు. ఇది పాత తరం ఆచారమే అయినా వర్షాలు కురువక అల్లాడుతున్న రైతులు, ప్రజలు వర్షాలు కురువాలని వేడుకుంటూ కప్పతల్లిపై నీరు పోస్తూ మెుక్కులు చెల్లించున్న తీరు ఇది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామస్తులు, రైతులు కర్రకు కప్పతల్లిని కట్టిన చిన్నారులు ఇంటింటా తిరుగుతూ రాగా, ప్రతి ఇంటి గుమ్మం ఎదుట కప్పతల్లిపై నీరు పోస్తూ వర్షాలు కురువాలని, సాగు చేసిన పంటలు కాపాడాలని వేడుకున్నారు. వర్షాకాలం ఆరంభమై దుక్కులు దున్నిన రైతులు పలు రకాల పంటల సాగుకు అవసరమైన విత్తనాలు విత్తారు. అప్పుడప్పుడు పడిన చిరుజల్లులే తప్ప ఓ మెాస్తారు వర్షాలు కురిసిన దాఖలాలే లేవు. ఈ కారణంగా దుక్కులో విత్తిన విత్తనాలు మెులకెత్తక పోగా.. కాస్త తడిగ ఉన్న భూముల్లో మెులకెత్తిన మెులకలు వాడిపోవడంతో ఆవేదనలో మునిగిన రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. తాము చేసే ప్రయత్నాలు చేస్తే వరుణుడి కరుణతో వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో కర్రకు కట్టిన కప్పతల్లిని చిన్నారులు కేరింతలు వేస్తూ ఊళ్లోని ఇంటింటా తిప్పారు. గ్రామస్తులు తమ గుమ్మం ఎదుట కప్పతల్లిపై నీరు పోసి వర్షాలు కురువాలని మెుక్కుకున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad