- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని సోమలింగాల గుట్టకు వెళ్లే దారిలో గల కట్ట మైసమ్మ ఆలయ విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ముందుగా వేదమంత్రోచ్చరణలతో పూజలు చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. పురాతన ఈ కట్ట మైసమ్మ ఆలయం శిథిలావస్థలోకి చేరడంతో ప్రత్యేకంగా ఇనుప జాలి ఏర్పాటు చేసిన పునరుద్ధరణ చేయడం జరిగిందని సంతోష్ సేట్ నార్లవార్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఆలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
- Advertisement -



