నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు సానియా, ఆది దుర్గ, రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 16న కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లాస్థాయి ఎంపిక పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈనెల 18 నుండి 19 తేదీలలో రంగారెడ్డి జిల్లా గురుకుల విద్యాపీట్ హైస్కూల్ ఇబ్రహీంపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు సుభాష్, పిడి భక్తు రాజకుమార్ ,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అనిత.గ్రామస్తులు తణుకు ఓంకార్ షేట్, గాజుల శ్రీనివాస్ ,జాతీయ క్రీడాకారుడు సంపత్. ఉపాధ్యాయు బృందం హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES