- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
మండల పరిధిలోని గంభీర్ పూర్ లో శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో శనివారం కృష్ణాష్టమి వేడుకలకు ఘనంగా జరుపుకున్నారు. గోపి గోపికల వేషధారణతో విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎండీ. షరీఫ్ మాట్లాడుతూ.. పండుగల్ని, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.
- Advertisement -