Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఏసీబీ ముందుకు కేటీఆర్..బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్..బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏసీబీ ముందుకు మరోసారి కేటీఆర్ వెళ్లనున్నారు. నేడు ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్‌ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఫార్ములా ఈ-కార్ రేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది ఏసీబీ. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్ఈఓకు రూ.50 కోట్లకుపైగా నిధులు మళ్లించడంపై ఏసీబీ దృష్టి పెట్టింది.
ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఏసీబీ. ఇక నేడు ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్‌ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -