Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా జాగృతి ఉపాధ్యక్షులుగా లచ్చన్ మీరేవార్ సాయిలు

జిల్లా జాగృతి ఉపాధ్యక్షులుగా లచ్చన్ మీరేవార్ సాయిలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లచ్చన్ గ్రామానికి చెందిన మీరేవార్ సాయిలు కామారెడ్డి జిల్లా జాగృతి ఉపాధ్యక్షులుగా నియమితులు కావడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఆయనకు గ్రామ పెద్దలు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సన్మాన కార్యక్రమంలో జిల్లా స్థాయి పదవిని చేపట్టిన మీరేవార్ సాయిలు కు  గ్రామ ప్రతినిధులు శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. సాయిలు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం గ్రామానికి గర్వకారణమని, తమ పదవి ద్వారా జిల్లా, సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -