Monday, November 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకెన్యాలో విరిగిపడిన కొండ చరియలు

కెన్యాలో విరిగిపడిన కొండ చరియలు

- Advertisement -

26 మంది మృతి..30 మందికి పైగా గల్లంతు
కెన్యా: ఆఫ్రికా దేశమైన కెన్యాలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 26 మంది చనిపోగా, 30 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.దక్షిణ కెన్యా ప్రాంతంలోని మారాక్‌వెట్‌ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడ్డాయని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని సదరు మంత్రి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ వర్షాకాలం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -