- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో కెమిస్ట్రీ, జియాలజీ లెక్చరర్లను నియమించాలని టీజీవీబీ మండల అధ్యక్షులు భరత్ రాజ్ బుధవారం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి రాధాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీవీపి ఉపాధ్యక్షుడు కార్తీక్, కళాశాల ప్రెసిడెంట్ విద్యాసాగర్, శ్రీనిధి, గాయత్రి, తదితరులు ఉన్నారు.
- Advertisement -