- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: మండలంలోని ధర్మారం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న జాదవ్ కృష్ణవేణి మనోజ్ కూతురు శ్రీకృతి పుట్టినరోజు సందర్భంగా పాఠశాల విద్యార్థుల కోసం ఎల్ఈడి టీవీ ని విరాళంగా అందించారు. సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బండి సత్తన్న మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు ముందుకు వచ్చి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు సాత్పడి నర్సయ్య, సాదుల నర్సయ్య, మేతరి నాగన్న , వాలంటీర్లు బట్టారి కృష్ణవేణి, పావని మేడం , అటెండర్ గొల్లపల్లి నారాయణ పాల్గొన్నారు.
- Advertisement -