– ఎగ్జిట్ పోల్స్ వెల్లడి ొ నేడే ప్రమాణ స్వీకారం
సియోల్: కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు లక్షలాదిమంది దక్షిణ కొరియన్లు మంగళవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 79.4శాతం మేరకు ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 70శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తయితే విజేత ఎవరో తేలిపోతుందని భావిస్తున్నారు. కాగా, బుధవారమే కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంది. దేశంలో సైనిక పాలన విధించినందురకు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను అధికారం నుండి తొలగించడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది. యూన్కు ప్రత్యర్ధి అయిన లీ జే మియంగ్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఎన్నికల ముందు సర్వేలు పేర్కొంటున్నాయి. లీ జే మియంగ్కు 50శాతానికి పైగా ఓట్లు సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. అదే సమయంలో పాలక కన్జర్వేటివ్ పీపుల్ పవర్ పార్టీకి 39శాతం మేరకు ఓట్లు లభిస్తాయని అంచనాలు వున్నాయి. యూన్ మార్షల్ లా ఓటమి నేపథ్యంలో కన్జర్వేటివ్లపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో ఉదారవాది అయిన లీ గెలుపు తధ్యంగా కనిపిస్తోంది. కాగా కన్జర్వేటివ్ల ప్రధాన అభ్యర్ధి కిమ్ మూన్ సూకి చెందిన పీపుల్ పవర్ పార్టీలో ముఠా ఘర్షణలు నెలకొనడం కూడా మైనస్ పాయింట్గా మారింది. గత ఆరు మాసాలుగా దేశంలో యూన్కు వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్ద సంఖ్యలో ర్యాలీలు కొనసాగుతునే వున్నాయి. యూన్ అభిశంసన, అసమ్మతి కారణంగా నాయకత్వ స్థానంలో శూన్యం నెలకొనడంతో ఉన్నత స్థాయిలో దౌత్య కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే కొత్త అధ్యక్షుడిపై రాజకీయ భారం పడనుంది. మందగించిన ఆర్థిక వ్యవస్థతో పాటూ పలు సవాళ్ళను ఎదుర్కొనాల్సి వుంది.
దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా లీ జే ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES