పాఠశాల హెచ్ఎం అరుణ్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు : భావి భారత పిల్లలను ఆరోగ్యంగా, ఆనందంగా, ఒత్తిడి లేని వాతావరణంలో చదువుకోనిద్దామని తాడిచెర్ల పరిధిలోని ఎస్సీ కాలనీ పాఠశాల ప్రాదానోపాధ్యాయుడు అరుణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొపెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్సికాలని, కాపురం పల్లెల్లో బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికై తమ వంతు బాధ్యతగా తమ పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్, రుచికరమైన మధ్యాహ్న భోజనం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. పాఠశాలలో నిర్వహించబడుతున్న వివిధ కార్యక్రమాలను, గురుకులంలో సీటు సంపాదించిన విద్యార్థులను అభినందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు ఇందారపు సురేష్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పిల్లలను ఒత్తిడిలేని వాతావరణంలో చదువుకొనిద్దాం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES