Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కలను నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుకుందాం

మొక్కలను నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుకుందాం

- Advertisement -

ఎంపిడిఓ లింగం నాయక్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
: మొక్కలను నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదమని ఎంపిడిఓ భూక్య లింగం నాయక్ పేర్కొన్నారు. సోమవారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్  గ్రామ పంచాయితీలోని నర్సరీ లో ఉన్న మొక్కల మొత్తం 10000 (పది వేయిలు)  ప్రతి ఇంటికి రేండు మొక్కల చోప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి దానిని పర్యవేక్షించాలని, నేటి మొక్కలే రేపటి వృక్షాలని అన్నారు.

పంచాయితీ సిబ్బందికి మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయితిలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. 34 గ్రామ పంచాయితీలు హోం స్టిక్స్ పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -