- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
బంగారం లాంటి బంకమట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేశారు మోపాల్ గ్రామనికి చెందిన చిన్నారులు. మట్టి వినాయకున్ని పూజిద్దాం మన వంతు కాలుష్యాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చారు. ఈరోజుల్లో గణపతి విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుండి తయ్యారువుతున్నాయి. తద్వారా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అసలు వినాయకుడు పుట్టింది పార్వతీదేవి మెని నలుగు మట్టి నుంచి. అందుకే ఆయన విగ్రహాన్ని మట్టితోనే చెయ్యాలని తపనతో మోపాల్ గ్రామ చిన్నారులు అక్షర రెడ్డి, ఆకృతి, లడ్డు, లక్కీ, హాస్య, హరిని, కన్నయ్య, మనోజ్ , శశ్వీక్ లు అందంగా వినాయకుడిని ముస్తాబు చేశారు.
- Advertisement -