కవితాదర్పణం, సీతాశతకం ఆవిష్కరణ సభ
దర్పణం సాహిత్య వేదిక నిర్వహణలో డా. చీదెళ్ళ సీతాలక్ష్మి రచించిన ‘కవితాదర్పణం’, శంకర నారాయణ రచించిన ‘సీతాశతకం’ గ్రంథాల ఆవిష్కరణ ఈ రోజు 5వ తేదీ సాయంత్రం ఐదున్నరకు హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరుగుతుంది. డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా. ఏనుగు నరసింహారెడ్డి దాస్యం సేనాధిపతి, డా. మామిడి హరికష్ణ, డా. నామోజు బాలాచారి, చెన్నూరి సీతారాంబాబు, ముదిగొండ సంతోష్ , చిత్రకారిణి రూపాదే, రామకష్ణ చంద్రమౌళి, వడ్డేపల్లి విజయలక్ష్మి పాల్గొంటారు.
- డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
రెండుతరాల కవిసంగమం
రెండుతరాల కవిసంగమం సీజన్-2 సీరీస్ -40 ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బషీర్బాగ్లోని నిజాం కాలేజీ ప్రాంగణంలో జరుగుతుంది. ప్రసేన్ జి, చిగురాల్ పల్లి ప్రసాద్, కల్యాణి కుంజ, బాలు అగ్నివేష్, మేనావథ్ రఘు (నిజాం కాలేజి విద్యార్థి) ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
- కవిసంగమం టీమ్