కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
నవతెలంగాణ – జన్నారం
హైకోర్టు ఇచ్చిన స్టే ని వేకెట్ చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై బీసీ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ .. బీసీ జాతీయ రాష్ట్ర బీ సీ సంఘాల పిలుపు ననుసరించి మండల బీసీ సంఘం తరఫున జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రములో రాస్తా రోకో నిర్వహించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన బీసీలకు 42 శాతం హామీని నిలబెట్టుకోవాలి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కుల గణన చేపట్టడమూ అసెంబ్లీలో బీ సీ బిల్లు ప్రవేశపెట్టే ఆమోదించడమూ, గవర్నర్ కి బిల్లును పంపించడం చివరికి జీ ఓ నెంబర్ 9 నీ విడుదల చేయడం జరిగిందన్నారు.. ఈ విషయంగా రెడ్డి జాగృతి సంఘం తరఫున హైకోర్టులో కేసు వేయడం వలన స్టే విధించింద దారుణం అన్నారు . దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయినాయనీ, మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన స్టే వేకేట్ చేసి 42 శాతం బీ సీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూఅన్నారు. ధర్నా చేస్తున్న సమయంలో రోడ్డు కిరువైపులా భారీ వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బీసీ సంఘ నాయకులతో మాట్లాడడంతో ధర్నాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కడార్ల నరసయ్య మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ , జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ , మాజీ ఎంపిటిసి రాగుల శంకర్ , ప్రధాన కార్యదర్శి సంద గోపాల్ , మామిడి విజయ్ , ముదిరాజ్ సంఘం మండల ఉపాధ్యక్షుడు ఐలవేణి రవి మహేంద్ర సంఘం నాయకుడు పిల్లి మల్లయ్య కోడి జుట్టు రాజయ్య , ఒడిపెల్లి రామన్న ఒడిపెల్లి రాజేష్, ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం, పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న , మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ , మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ ముంజంపెల్లి సాయి కనికరపు గంగాధర్ గడ్డం సత్తయ్య , ఈర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.