నవతెలంగాణ – ఆర్మూర్
ఖేలో ఇండియా బీచ్ వాలీబాల్ తెలంగాణ జట్టు కు కోచ్ గా మండలంలోని మగ్గిడి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు మధు వ్యవహరించనున్నారు. ఈ క్రీడలు ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు కేంద్ర పాలిత ప్రాంతం డయ్యు డామన్ లో జరుగుతాయనీ శనివారం తెలిపారు. తెలంగాణ జట్టు కోచ్ గా ఎంపిక పట్ల తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ గజ్జల రమేష్ బాబు , వైస్ ప్రెసిడెంట్ , తెలంగాణ జనరల్ సెక్రెటరీ శ్రీ హనుమంత్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ మల్లేష్ గౌడ్ , క్రీడల అధికారి శ్రీ పవన్ , మగ్గిడి గ్రామ సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్ , మగ్గిడి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ విడిసి సభ్యులు వ్యాయామ ఉపాధ్యాయులు భూపతి శ్రీనివాస్ యాదగిరి సురేష్ లు అభినందించారు.
జాతీయ స్థాయి ఖేలో ఇండియా క్రీడల కోచ్ గా మధు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



