- Advertisement -
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో గురువారం బండివార్ రమేశ్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ గురువారం మృతుడికి అంత్యక్రియలు పంచాయతీ సిబ్బందితో కలిసి నిర్వహించారు. సర్పంచ్ మానవత్వం పట్ల గ్రామస్తులు ఆయనను అభినందించారు.
- Advertisement -



