- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఇటు తెలంగాణ అటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు బార్డర్ లో గల బిచ్కుంద బండ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున వేడుకలు గొప్పగా జరుగుతాయని మేనూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ అన్నారు. బిచ్కుంద సద్గురు బస్వలింగప్ప స్వామి సంస్థాన్ మఠం మహాశివరాత్రి మహోత్సవ కరపత్రాలను ఆయన ఆదివారం మేనూరు శివారు ప్రాంతంలోని వై గోవిందుకబట్టి వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మహోత్సవాలకు మూడు రోజులపాటు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై గోవింద్, మేనూరు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



