- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నైలోని అన్నానగర్ లో గల జీఎస్టీ ఆఫీస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు రెండు, మూడు అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



