- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : సోమవారం మద్నూర్ మండలంలోని పెద్ద ఏక్లారా, పెద్ద తడగుర్, రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ను విజయవంతం చేయాలని ఏఓ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటలకు రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం రైతు నేస్తం విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారమవుతుందని అన్నారు. ఈ సందర్బంగా రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -