- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
ప్రజలు తమ ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా చూసుకోవాలని మండల వైద్యాధికారి యేమిమా తెలిపారు. శుక్రవారం ఫ్రైడే డ్రై డే సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలలో ఆశా వర్కర్లు ప్రతి ఇంటి పరిసరాలను పరిశీలించి నీరు నిల్వ ఉన్న వాటిని గుర్తించి నీటిని తొలగించారు. లార్వా ఉన్న స్థానాలను గుర్తించి వాటిని తొలగించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి దివ్య, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -