Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐద్వా 14వ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి 

ఐద్వా 14వ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి 

- Advertisement -

ఐద్వా జిల్లా కార్యదర్శి  ఎ. నర్మద
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోన ఐద్వా ఆఫీస్ నందు  14, వ జాతీయ మహాసభలు జయప్రదం చేసేందుకు ఐద్వా ఆధ్వర్యంలో సమావేశం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 వ జాతీయ మహాసభ ల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సమావేశం లో ఐద్వా జిల్లా కార్యదర్శి  ఎ. నర్మద మాట్లాడుతూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా  14వ జాతీయ మహాసభలు  2026 జనవరి 25-28, తేదీల్లో   హైదరాబాద్ లో జరగనున్నాయని తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు వేదిక కానుందని తెలిపారు.

నాలుగు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో దేశవ్యాపితంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు చర్చించి, రూపొందించబోయే భవిష్యత్ కార్యాచరణ మహిళా ఉద్యమాలకు దిశనిర్దేశం చేయనున్నదని అన్నారు.  జోగులాంబ గద్వాల జిల్లా నుండి మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు  పద్మ , ఐద్వా నాయకులు  కాంతమ్మ,  సునీతా, రాణి, సంగీత, ప్రియాంక,  కమల, లలిత, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -