Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జులై 9న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

జులై 9న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిద్దాం
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుకై మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతికటిద్దాం
సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, 12 గంటల పని దినాన్ని వ్యతిరేకించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల ను రద్దు చేయాలని, మోడీ వ్యతిరేక విధానాల ను ప్రతికటించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో జులై 9 న జరిగే సార్వత్రిక సమ్మె బుక్ లేట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9 న జరిగే దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ స్వాతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలియజేశారు.

నేటికి 29 కార్మిక చట్టాని రద్దు చేసి కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 8 గంటలు ఉన్న కార్మికుల శ్రమ కాలాన్ని 12 గంటలకు పెంచిందని దుయ్యబట్టారు. యూనియన్ ల ఏర్పాటు చేసుకోవాలంటే కార్మికుల అవసరాన్ని బట్టి కాకుండా అధికారికి ఇష్టం ఉంటే యూనియన్ ఏర్పాటు చేయవచ్చు అనే పరిస్థితి ఇచ్చి యాజమాన్యాల చేతిలో యూనియన్ ని పెట్టిందని విమర్శించారు.కార్మికుల సమ్మె హక్కును ప్రశ్నార్ధకం చేసిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మికుల కనీస వేతనాల పై , స్కీం వర్కర్స్ సమస్యలపై, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై పట్టించుకోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ లకు మాత్రం నేటికి 16 లక్షల 35 వేలకోట్లు కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు.దేశ వ్యాపితంగా సిఐటియు, ఏఐటీయూసీ, ఐ యన్ టి యు సి, హెచ్ యం యస్, ఐఎఫ్టీయు, టి ఆర్ యస్ కె వి లాంటి జాతీయ , రాష్ట్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని కార్మిక హక్కుల కోసం జరిగే ఈ సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గణేష్, బుచ్చయ్య, రమేష్, నరేష్, అజయ్, సురేష్, విజయ , ప్రకాష్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -