Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొండంపేట కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడుగా మల్లారెడ్డి

కొండంపేట కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడుగా మల్లారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టిపిసిసి ప్రదాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచనలు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఈ గ్రామ ఈ ఎన్నిక పరిశీలకుడు కోడారి చిన మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని కొండంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ కొండంపేట గ్రామశాఖ అధ్యక్షుడుగా చల్లా మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడుగా కుంభం ముకుంద రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా శనిగరం బాపు, అధికారప్రతినిదిగా శనిగరం రమేష్, కోశాధికారిగా బద్దీ మల్లయ్య,సోషల్ మీడియా ఇంచార్జిగా తొడల లక్ష్మన్ తోపాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి,కాంగ్రెస్ పార్టీ మహిళ మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ,ప్రధాన కార్యదర్శి తెప్పల రజిత,మాజీ సర్పంచ్ లు పోటు ప్రభాకర్ రెడ్డి,ఇరుకు పొచయ్య, మాజీ ఎంపిటిసి ఏనుగు నాగరాని లక్ష్మీ నారాయణ,శనిగరం రాజయ్య,శ్రవణ్, సమ్మయ్య,శంకరయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -