- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 32 0డి వారు నిర్వహించిన కార్యక్రమంలో సేవలకు గుర్తింపుగా అవార్డుతో పాటు సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం, స్థానిక కౌన్సిలర్లు, వీడీసీ బృందం అభినందించారు.
- Advertisement -